1927 ప్రారంభంలో బీజం పడింది. ఎంజిఎం స్టూడియో చీఫ్ లూయిస్ బి. మేయర్ తన ముగ్గురి మిత్రులతో(దర్శకుడు ఫ్రెడ్ నిబ్లో, నిర్మాత ఫ్రెడ్ బెట్సన్, నటుడు కరద్ నగేల్) కలిసి ప్రపంచవ్యాప్తంగా చిత్రపరిశ్రమకు ఏదైనా మేలు చేసే విధంగా ఒక సంస్థను నెలకొల్పాలనే వీరి ఆలోచనే ఆస్కార్ మోషన్ పిక్చర్స్స అకాడమీ ఏర్పాటుకు దారితీసింది. ఈ నలుగురు కలిసి లాస్ ఎంజెలెస్లోని అంబాసిడర్ హోటల్లో (జనవరి 11 1927లో) ఇంటర్నేనేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స అండ్ సైన్సెస్ రూపకల్పనకు ఓ ప్రపోజల్ను తయారు చేశారు.
డగ్లస్ ఫెయిర్బ్యాంక్, మేరీ పిక్మన్ మరో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. వీరే అకాడమీ వ్యస్థాపకులుగా చరిత్రలో నిలిచారు. తరువాత అందులోని ఇంటర్నేషనల్ను తొలగించారు. అనంతరం వెంటనే ఈ కాన్సెప్టును హాలీవుడ్ చిత్రపరిశ్రమలోని ప్రముఖులంతా మెచ్చుకోవడంతో మే 11, 1927న ప్రభుత్వం అకాడమీకి చార్టర్ను మంజూరు చేసింది. అనంతరంలో అకాడమీలో 300 మంది సభ్యులు చేరడం, అకాడమీ కోసం100 డాలర్లు సహాయం చేయడం చాలా వేగంగా జరిగింది.
మొదట ప్రారంభంలో ఐదు విభాగాల్లో ( నిర్మాతలు, నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు) ఈ అకాడమీని ప్రారంభించారు. ఈ అకాడమీకి మొదటి అధ్యక్షుడు (1927-29 వరకు) డగ్లస్ ఫెయిర్బ్యాంక్ వ్యవహరించగా రెండో అధ్యక్షుడు (1929-31) విలియం డెమిలీ వ్యవహరించారు. ఇప్పటి వరకు 32 మంది అధ్యక్షలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆస్కార్ మోషన్ పిక్చర్స్ అధ్యక్షునిగా సిడ్ గ్యానిస్ వ్యవహరిస్తున్నారు. అకాడమీ ఆధ్వర్యంలో 1929 మే 16న రూజ్వెల్ట్ హోటల్లో మొదటి ప్రదానోత్సవం జరిగింది. ప్రస్తుతం 81వ అస్కార్ మోషన్ పిక్చర్ అవార్డు ప్రదానం జరుగుతోంది.
No comments:
Post a Comment